ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్ 20 20 ఎంపిక పోటీలో అనంతపురం క్రీడాకారుల ప్రతిభ
Posted on 18-01-2022
News image

ఈ నెల 3 , 4 వ తేదీలలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం వేదికగా  గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నైట్స్ క్యాజెల్ చెస్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్స్ ఛాంపియన్షిప్-2022 ఎంపిక పోటీల్లో  అనంతపురం క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. అండర్-13 బాలికల విభాగంలో శ్రీహ చాంపియన్షిప్ ను  కైవసం చేసుకుని  త్వరలో జరగబోయే 9వ నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్-2022 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది.

అలాగే , అండర్-13 బాలికల విభాగంలో 5 వ స్థానాన్ని భువన కృతి , అండర్-11 ఓపెన్ విభాగంలో రెండవ స్థానాన్ని సామ్యూల్ స్టీఫెన్ నోబుల్  , అండర్-9 ఓపెన్ విభాగంలో 4వ స్థానాన్ని సహృద్ , అండర్-9 బాలికల విభాగంలో 4 వ స్థానాన్ని వర్ణిగ , అండర్-7 ఓపెన్ విభాగంలో 3వ స్థానాన్ని అన్ని శ్రీ సాకేత్ ,అండర్ 15  ఓపెన్ విభాగంలో 2వ స్థానాన్ని భరత్ భూషణ్  , 4వ స్థానాన్ని షణ్ముఖ నందు,  అండర్ 15  బాలికల విభాగంలో 2వ స్థానాన్ని సంజన , 4వ స్థానాన్ని లాక్షిణ్య కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచినటువంటి క్రీడాకారులు అందరూ కూడా  ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విజేతలందరినీ ఆల్ అనంతపూర్ సోషల్ చైర్మన్ బాలరాజు,  అధ్యక్షకార్యదర్శులు శివకుమార్ , ఉదయ్ కుమార్ నాయుడు అభినందించారు.