అఖిల్ శ్రీ ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతి


                   

                 పోర్ట్ ఇండోర్ స్టేడియం వేదికగా అక్టోబర్ 1st-7th వరకు జరిగిన 36 జాతీయ U11 ఓపెన్ విభాగంలో విశాఖపట్నం చెందిన చదరంగ క్రీడాకారుడు శ్రీ అఖిల్ ప్రసాద్ 11 వా స్థానం సంపాదించి 10,000/- రూపాయలు బహుమతిగా అందుకున్నారు.ఈ కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ex. చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు.

విశాఖ వైసిపి ఉత్తర నియోజకవర్గం సమన్వయ కార్యకర్త శ్రీ కేకే రాజు గారు చేతులు మీదుగా ఈ లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతి శ్రీ అఖిల్ ప్రసాద్ కు అందజేయడం జరిగింది.

ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు చదరంగం క్రీడాకారుడు శ్రీ అఖిల్ ప్రసాద్ ఆనందంతో శ్రీ వై వి సుబ్బారెడ్డి గారికి శ్రీ కేకే రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.